హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణకు ప్రత్యేక ప్రాంతీయ బోర్డు: జాతీయ మీడియాలో కథనాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి తెలంగాణ అభివృద్ధికోసం వెంటనే తెలంగాణ ప్రాంతీయ బోర్డును ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో కేంద్రానికి చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. తెలంగాణ వెనుకబడి ఉందని, తెలంగాణ సెంటిమెంటు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉందని అందుకు వారు వెనుకబాటుతనమే కారణమని నివేదికలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వెనుకబాటుతనమే ప్రాతిపదికన రాష్ట్రాన్ని విడదీయలేమని అందులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. వెనుకబాటుతనమే ప్రాతిపదిక అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు అంతకంటే ఎక్కువ వెనుకబడి ఉన్నాయన్నారు.

తెలంగాణకు ఓ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థను వెంటనే ఏర్పాటు చేయాలని అందులో సూచించినట్టు తెలుస్తోంది. నిధుల సమీకరణ, ఖర్చు, నిధుల కేటాయింపు అన్నీ ఆ బోర్డుకే అప్పగించాలని అందులో సూచించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉద్యోగాలు తదితరాల విషయంలో ప్రాంతీయ బోర్డుకే అధికారాలు ఇవ్వాలని అందులో సూచించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిని రెండేళ్లు పరిశీలించాలని, రెండేళ్లు పరిశీలించిన అనంతరం అవసరమైతే అప్పుడు ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని అందులో సూచించినట్టు తెలుస్తోంది.

రెండేళ్ల తర్వాత పూర్తి పరిశీలన తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంపై ఆలోచించాలని సూచించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రాష్ట్రాన్ని విడదీసినప్పటికీ రెండు రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలని సూచించారు. పదేళ్లు హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ఉంచాలన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్న హైదరాబాదు రాజధాని ఉందని కాబట్టి పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని సూచించారు. ఆ తర్వాత హైదరాబాదును స్వయంప్రతిపత్తిగల ప్రాతంగా ఏర్పాటు చేయాలి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X