హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజారాజ్యం ఎమ్మెల్యే అనీల్ కుమార్ ‌కు కార్యకర్తలనుండి పరాభవం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Prajarajyam
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఇందిరాపార్కు వద్ద చేపట్టిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఆందోళనలో ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యుడు అనీల్‌ కుమార్‌ కు కార్యకర్తలు, తెలంగాణవాదుల నుండి తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ఆందోళనలో పాల్గొనడానికి అనీల్ రావటంతో తెలంగాణవాదులు ఒక్కసారిగా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో ఉన్న అనీల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన చేసేది లేక అక్కడినుండి వెనుదిరిగి వెళ్లిపోయారు.

ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చిరంజీవి సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నామని చెబుతున్నప్పటికీ అనీల్ ప్రజారాజ్యంలో కొనసాగటం తెలంగాణవాదులకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. గతంలో అనీల్ తెలంగాణ ప్రజారాజ్యం అన్నప్పటికీ ఆ తర్వాత పార్టీ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నానని, తెలంగాణ సాధనకు చిరంజీవితో విభేదించి తెలంగాణ ప్రజారాజ్యం అంటూ మరోవైపు పార్టీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటంపై తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కాగా ఇటీవలే తెలుగుదేశం పార్టీనుండి బయటకు వెళతానని ప్రకటించిన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X