హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూరి హత్య కేసులో పురోగతి: పోలీసుల అదుపులో ఏడుగురు

By Pratap
|
Google Oneindia TeluguNews

Maddelachervu Suri
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో హైదరాబాదు పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ గురువారం చెప్పారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు, మరి కొంత మందిని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అయితే, ఆ ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు గానీ అధికారికంగా అరెస్టు చేయలేదు.

అయితే, సూరి హత్య కేసులో ప్రధాన అనుమానితుడు భాను కిరణ్ పట్టుబడితే తప్ప కేసు కొలిక్కి రాదని ఖాన్ అన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఏడుగురికి ప్రత్యక్షంగా సూరి హత్యతో సంబంధం ఉందని చెప్పలేం. కాగా, భాను కిరణ్ షోలాపూర్ పారిపోయాడని, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లి ఉంటాడనే విషయంపై ఆనవాళ్లు లభించడం లేదని అంటున్నారు. కాగా, భాను కిరణ్ పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X