హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భాను లింక్స్: సింగనమల రమేష్‌ పై నిర్మాత జయంతి రెడ్డి ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

Singamala Ramesh
హైదరాబాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్‌ తో నిర్మాత సంగినమల రమేష్ సంబంధాలు మరో రకంగా కూడా బయటపడ్డాయి. భాను కిరణ్‌ తో కలిసి వచ్చిన సింగనమల రమేష్ తనను బెదిరించాడని సినీ నిర్మాత జయంతి రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జయంతిరెడ్డి హైదరాబాద్ నగర నేరపరిశోధక విభాగం (సిసిఎస్) పోలీసులకు ఆదివారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఓ ఆస్తి వివాదంపై భాను కిరణ్‌తో కలిసి వచ్చి రమేష్ తనను బెదిరించినట్లు జయంతి ఆరోపించారు. ఇది ఏడు కోట్ల రూపాయల వివాదమని తెలుస్తోంది.

కాగా, భాను కిరణ్ ఆచూకీ పోలీసులకు దొరికినట్లు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో అతన్ని ఆరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. సూరి హత్య కేసులో ఇప్పటికే నిర్మాతలు సి. కళ్యాణ్, సింగనమల రమేష్‌లను పోలీసులు విచారించారు. రమేష్‌ ను పోలీసులు మరోసారి విచారించే అవకాశాలున్నాయి. అయితే, అతను శబరిమల వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా, సినీ రంగానికి చెందిన మరో ప్రముఖుడిని కూడా పోలీసులు విచారించే అవకాశాలున్నట్లు సమాచారం. సూరి హత్య కేసులో పోలీసులు ఇప్పటి వరకు 27 మందిని ప్రశ్నంచారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X