విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గవర్నర్‌ ను తెలంగాణవాదులు రాజకీయాల్లోకి లాగుతున్నారు: రాయపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
విజయవాడ: గవర్నర్ నరసింహన్ సీమాంధ్ర ఎంపీలకు సహకరిస్తున్నాడని తెలంగాణవాదులు అంటున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు సోమవారం విజయవాడలో స్పష్టం చేశారు. గవర్నర్ సుప్రీం అని అన్నారు. ఆయన రాజకీయాల్లో లేరని అయినప్పటికీ తెలంగాణకు చెందిన నేతలు ఆయనను అనవసరంగా రాజకీయాల్లోకి లాగుతున్నారన్నారు. ఆయన నుండి మాకు ఎలాంటి మద్దతు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని ప్రాంతాలకు సరియైన న్యాయం చేస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి అన్ని ప్రాంతాలు సమానమేనన్నారు.

తాము పిలిచినప్పుడే ఎవరి వద్దకైనా వెళ్లామని అన్నారు. పనిగట్టుకొని ఏ సీమాంధ్ర ఎంపీ కూడా వెళ్లలేదన్నారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా తమను పిలిస్తేనే వెళ్లామన్నారు. సీమాంధ్ర ఎంపీలందరూ తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X