వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రణభూమిగా జమ్మూ-పంజాబ్ సరిహద్దు: కదులుతున్న బిజెపి కార్యకర్తలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ekta Tiranga Yatra
శ్రీనగర్: జమ్మూ-కాశ్మీర్‌లో భారత దేశ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి తరలి వెళ్లిన లక్షలాది మంది భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవడంతో జమ్మూ-పంజాబ్ సరిహద్దు ప్రాంతం రణభూమిగా మారింది. కార్యకర్తలు భారీగా త్రివర్ణ పతాకాలతో తరలి వచ్చారు. బిజెవైఎం కార్యకర్తలను పోలీసులు లఖన్‌పూర్ బ్రిడ్జి వద్ద అడ్డుకుంటున్నారు. దీంతో అక్కడ హైడ్రామాగా మారి హైటెన్షన్ నెలకొంది. పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ కార్యకర్తలు వెనక్కి తగ్గడం లేదు. తాము తప్పకుండా శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ ప్రాంతంలో భారతీయ జెండాను ఎగురవేస్తామని చెబుతున్నారు.

పోలీసులు పంజాబ్-జమ్మూ సరిహద్దుల్లో అడ్డుకుంటున్నప్పటికీ కార్యకర్తలు వారిని తోసుకుని ముందుకు వెళ్లారు. ఈ తిరంగా యాత్రలో సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. తిరంగా యాత్ర జమ్మూ చేరుకున్నాక పోలీసులు అడ్డుకోవడాన్ని దేశంలో కూడా తీవ్రంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రాష్ట్రాలనుండి కార్యకర్తలు వెళుతున్నప్పటికీ అడ్డకోవడాన్ని వ్యతిరేకించాయి. జమ్మూ వెళ్లిన లక్షలాది మంది కార్యకర్తలతో త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది. భారతదేశంలో అంతర్భాగమైన శ్రీనగర్‌లో జాతీయ జెండా ఎగురవేయడానికి అడ్డు చెప్పడం తీవ్రవాదులకు ఊతమివ్వడమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, జమ్మూలో ఓమర్ ప్రభుత్వం తీవ్రవాదులకు అండగా నిలుస్తున్నాయని విమర్శించారు. జనవరి 26వ తారీఖున శ్రీనగర్‌లో తప్పకుండా జాతీయ జెండా ఎగురవేస్తామని చెప్పారు. భారత్‌లో పాకిస్తాన్ జెండా ఎగురవేస్తే పట్టించుకోని ప్రభుత్వం మన జాతీయ జెండాను ఎగురవేస్తే అడ్డుకోవడాన్ని ప్రజల హర్షించరన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X