హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ అవినీతిపై చంద్రబాబు పోరాటం: జాతీయస్థాయిలో ఆందోళనలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కాంగ్రెస్ అవినీతిపై జాతీయస్థాయిలో ఆందోళన చేయడానికి సన్నద్దమయ్యారు. ఆదివారం చంద్రబాబు అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేశారు. ఇందులో వామపక్షాలు, తమతో కలిసి వచ్చే మరిన్ని పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై జాతీయస్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈనెల 3వ తారీఖున ఆర్డీవో కార్యాలయాల వద్ద అవినీతికి వ్యతిరేకంగా ఆందోళనను నిర్వహిస్తారు. ఆ తర్వాత 8వ తారీఖు వరకు ఆందోళలు నిర్వహిస్తారు. 8వ తేదిన వామపక్షాలు, తదితర జాతీయ పార్టీలతో కలిసి ఢిల్లీలో నిరసన సభను ఏర్పాటు చేస్తారు.

అఖిలపక్షం భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధరలను వంద రోజుల్లో తగ్గిస్తానని చెప్పి ఇప్పటికీ తగ్గించలేదని ఆరోపించారు. కాంగ్రెస్ హయంలో ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. సామాన్యులు తినే పరిస్థితి లేకుండా ఉందన్నారు. ప్రభుత్వం ధరలు ఇప్పటి వరకు ఎందుకు తగ్గించలేదని చంద్రబాబు ప్రశ్నించారు. కేంద్ర విధానాలు సంపన్నులకే తప్ప సామాన్యులకు ఎలాంటి దోహదం చేయవన్నారు. కానీ ప్రభుత్వంలో ఉన్న వారు మాత్రం లక్షల కోట్ల రూపాయల ప్రజల ఆస్తిని దోచేస్తున్నారన్నారు. ధరలు అదుపు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని సిపిఎం కార్యదర్శి రాఘవులు అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X