మంత్రి డికె అరుణ హత్యకు కుట్ర, బెదిరింపు కాల్స్: తప్పిన ప్రాణాపాయం!
అయితే ఐజ దగ్గర పోలీసులు గాలించడంతో కొన్ని డిటోనేటర్లు దొరికాయి. రాత్రి సమయంలో పేలుడు పదార్థాలు దొరికాయి. ఫోన్ చేసిన వ్యక్తి గురించి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినట్టు జిల్లా ఎస్పీ చెప్పారు. అయితే పేలుడు పదార్థాలు అమర్చినప్పటికీ అవి ప్రమాదకరమైనవి కావని ఎస్పీ చెప్పారు. విచారణ ప్రారంభించామన్నారు. కాగా రచ్చబండ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నందుకే మంత్రిని టార్గెట్ చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు ఫోన్ చేసిన అగంతకుడు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనవద్దని కూడా హెచ్చరించాడు.
రచ్చబండలో పాల్గొంటే చంపివేస్తామని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. డికె అరుణ వెళ్లే దారిలో ఆరు డిటోనేటర్లను దుండగులు అమర్చిపెట్టారు. బెదిరింపు చర్యలకు పాల్పడితే రచ్చబండలో పాల్గొనకుండా భయపడుతుందని దుండగులు భావించినట్లుగా తెలుస్తోంది.డిటోనేటర్లు ఖాళీగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ కారణంగా మంత్రిని బెదిరించడానికే గానీ చంపడానికి కాదన్న ఆలోచనతో కూడా దుండగులు అమర్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. వాటినీ లోతులో పెట్టక పోవడం కూడా గమనార్హం.