హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్‌కు చెక్ కాదు: చిరంజీవితో పొత్తుపై మంత్రి మాణిక్యవర ప్రసాద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Manikya Vara Prasad
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు చెక్ పెట్టేందుకే ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవితో కాంగ్రెసు పొత్తు పెట్టుకుంటోందనే వార్తలను మంత్రి మాణిక్యవర ప్రసాద్ ఖండించారు. చిరంజీవితో పొత్తు పెట్టుకోవడం జగన్‌కు చెక్ పెట్టడం కాదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వైయస్ జగన్ తిరిగి కాంగ్రెసు పార్టీలోకి రావాలని తాను కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. తాను వైయస్ రాజశేఖర రెడ్డి అభిమానని అని ఆయన చెప్పుకున్నారు. సిద్ధాంతాలు చూసి వైయస్ జగన్ పార్టీపై తాను మాట్లాడుతానని ఆయన చెప్పారు. జగన్ వర్గం నేత అంబటి రాంబాబు భాష సరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెసు పొత్తుపై ఇంకా నిర్ణయం జరగలేదని మరో మంత్రి దానం నాగేందర్ చెప్పారు. ప్రభుత్వం సంక్షోభంలో పడితే మద్దతిస్తామని చెప్పిన ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని ఆయన మంగళవారం విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు. నాలుగు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని ఆయన చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో విలీనమవుతుందా, కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటుందా అనే విషయాన్ని తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X