అందుకే చంద్రబాబు భయపడుతున్నారు: చిరంజీవి కామెంట్

Chiranjeevi
న్యూఢిల్లీ: తమ పార్టీ విలీనంతో కాంగ్రెసు బలం పెరుగిందని, అందువల్లనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని చిరంజీవి వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డితో భేటీ అనంతరం ఆయన సోమవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు మాటలను పెద్దగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని, భవిష్యత్తుపై చంద్రబాబుకు బెంగ పట్టుకుందని ఆయన ఆయన అన్నారు. సిపిఐ కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యలను కూడా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. విలీనంపై ప్రతిపక్షాల విమర్శలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా నెరవేరుస్తానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో బిజెపి లేదని, దానికి అస్తిత్వమే లేదని ఆయన అన్నారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనం చారిత్రాత్మకమైన ఘటన అని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెసులో ప్రజారాజ్యం పార్టీ విలీనాన్ని తాను స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు. పార్టీలో చిరంజీవి నిర్వర్తించాల్సిన పాత్రను పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ సభకు సోనియా గాంధీ వస్తారని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+