వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాడు: జూపూడి ప్రభాకరరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jupudi Prabhakar Rao
రాజమండ్రి: చిరంజీవి కాంగ్రెస్‌కు తన సామాజిక న్యాయవర్గాన్ని తాకట్టు పెట్టారని మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేత గోనె ప్రకాశరావు సోమవారం జగన్ పోలవరం సాధనయాత్ర ప్రారంభ సభలో అన్నారు. చిరంజీవి కాంగ్రెస్‌తో కలిసింది బలహీన వర్గాల కోసం కాదు అన్నారు. కేవలం తాను లాభ పడటానికే కాంగ్రెస్‌లో ప్రజారాజ్యాన్ని విలీనం చేశారన్నారు. జగన్ తన సత్తా పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో చాటుతారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం చిరంజీవితో కలిసిన కాంగ్రెస్ రాష్ట్రంలో తుడిచి పెట్టుకు పోవడం ఖాయమన్నారు. జూలైలో పంచాయతీ ఎన్నికల్లో జగన్ వర్గం అఖండ మెజారిటీ సాధిస్తుందన్నారు.

ప్రజా మద్దతుతో ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న యువకుడు వైఎస్ జగన్ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. జగన్ ఎవరినీ వెన్నుపోటు పొడవలేదన్నారు. పార్టీని స్థాపించి రెండున్నర సంవత్సరాలలో మరెవరి పార్టీలో విలీనం చేయలేదన్నారు. కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా జగన్ వచ్చారన్నారు. వైఎస్ బాటలో నడిచేది కేవలం జగన్ అన్నాడు. ఒక్క జగన్‌ను ఎదుర్కోవడం కోసం అందరూ కలిసి పోతున్నారన్నారు. ఫీజు రీయింబర్సుమెంటు కోసం చనిపోతే కారణం అది కాదని చెబుతున్న ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నించారు.

ఇది చేతకాని, పేదలను పట్టించుకోని ప్రభుత్వమన్నారు. పేదలకోసం అహర్నిషలు కృషి చేస్తున్న జగన్‌ను అడ్డుకునే ప్రయత్నాలు ఆపకపోతే ప్రజలే బుద్ది చెబుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీనుండి నాయకుని పంపి చిరును పిలిపించుకుందన్నారు. అదే జగన్‌ను రమ్మనడానికి ఎవరూ రాలేదు ఎందుకని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు రాష్ట్ర ప్రజలందరం అండగా ఉండి ఓ యువనేతను, ప్రజా సమస్యలు పట్టించుకునే రాజకీయ నాయకుణ్ణి ముందుకు తీసుకు వద్దామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X