జగన్ ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్నాడు: జూపూడి ప్రభాకరరావు
ప్రజా మద్దతుతో ప్రభుత్వానికి నిద్ర లేకుండా చేస్తున్న యువకుడు వైఎస్ జగన్ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. జగన్ ఎవరినీ వెన్నుపోటు పొడవలేదన్నారు. పార్టీని స్థాపించి రెండున్నర సంవత్సరాలలో మరెవరి పార్టీలో విలీనం చేయలేదన్నారు. కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వారసుడిగా జగన్ వచ్చారన్నారు. వైఎస్ బాటలో నడిచేది కేవలం జగన్ అన్నాడు. ఒక్క జగన్ను ఎదుర్కోవడం కోసం అందరూ కలిసి పోతున్నారన్నారు. ఫీజు రీయింబర్సుమెంటు కోసం చనిపోతే కారణం అది కాదని చెబుతున్న ప్రభుత్వానికి సిగ్గుందా అని ప్రశ్నించారు.
ఇది చేతకాని, పేదలను పట్టించుకోని ప్రభుత్వమన్నారు. పేదలకోసం అహర్నిషలు కృషి చేస్తున్న జగన్ను అడ్డుకునే ప్రయత్నాలు ఆపకపోతే ప్రజలే బుద్ది చెబుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీనుండి నాయకుని పంపి చిరును పిలిపించుకుందన్నారు. అదే జగన్ను రమ్మనడానికి ఎవరూ రాలేదు ఎందుకని ఆయన ప్రశ్నించారు. జగన్కు రాష్ట్ర ప్రజలందరం అండగా ఉండి ఓ యువనేతను, ప్రజా సమస్యలు పట్టించుకునే రాజకీయ నాయకుణ్ణి ముందుకు తీసుకు వద్దామని చెప్పారు.