డెబ్బై ఏళ్ల కలకు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణం పోశారు: వైఎస్ జగన్
ఈ సందర్భంగా ఆయన హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రం ఎడారిలా మారే అవకాశం ఉందన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. పోలవరం వల్ల రాష్ట్రం మొత్తానికి లాభం చేకూరుతుందన్నారు. నాడు అంబేడ్కర్, ఎన్జీ రంగా పోలవరం గురించి ఆలోచించారన్నారు. పోలవరం కోసమే తాను పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు.
నాటినుండి నేటి వరకు డెబ్బై సంవత్సరాలుగా పోలవరం కలగా మిగిలి పోయిందన్నారు. దివంగత వైఎస్ కలలా మిగిలిపోయిన పోలవరం ప్రాజెక్టును ప్రారంభించేందుకు రాష్ట్రం నుండి నిధులు కేటాయించారన్నారు. అయితే కేంద్రం నుండి నిధులు మాత్రం ఇవ్వడం లేదన్నారు. పోలవరం కోసం నేను పాదయాత్ర చేస్తున్నానని ఇవ్వవద్దు అనుకుంటే తప్పు అన్నారు.
పోలవరం కోసం కేవలం నేను కాదు, లక్షల కాళ్లు తనతో ఉన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పోలవరం నిర్మాణం కోసం ఆ భగవంతుడు మంచిబుద్ధిని ఇవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. పోలవరంతో పాటు, ప్రాణహిత-చేవెళ్ల, ఉత్తరాంధ్ర సుజలస్రవంతి తదితర ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర బాగుకోసం దివంగత వైఎస్ ప్రారంభించిన పోలవరాన్ని వెంటనే ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలవరం నిర్మించకపోతే రాష్ట్రం ఏడారిగా మారుతుందన్నారు.