రంగారెడ్డి: వేధింపుల కారణంగా శుక్రవారం మరో అమ్మాయి బలైంది. రంగారెడ్డి జిల్లాలో ఓ కంప్యుటర్ ఆపరేటర్ వేధింపుల కారణంగా అనంతలక్ష్మి అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. రంగారెడ్డి జిల్లాలోని బంటారం మండలంలో కోరుమామిడి గ్రామంలో అనంతలక్ష్మి పదవ తరగతి చదువుతోంది. అయితే గత కొంతకాలంగా కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆమెను వేధిస్తున్నాడు. సదరు వ్యక్తి వేధింపులు తట్టుకోలేక అనంతలక్ష్మి శుక్రవారం ఉదయం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా అనంతలక్ష్మి చనిపోవడానికి కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్న వ్యక్తియే కారణమని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
10th class girl student committed suicide today morning due to a computer operator harassments. Anantha Laxmi, resident of Korumamidi village of Rangareddy district consumed pesticide. Parents gave a complaint against computer operator and was arrested by police.