హైదరాబాద్:
తెలంగాణ
రాష్ట్ర
సమితి
(తెరాస)
అధ్యక్షుడు
కె.
చంద్రశేఖర
రావు
తెలుగుదేశం
పార్టీ
అధ్యక్షుడు
నారా
చంద్రబాబు
నాయుడిని
ఇరకాటంలో
పెట్టబోతున్నారు.
తెలుగుదేశం
తెలంగాణ
ప్రాంత
శాసనసభ్యులకు
సవాల్
విసరడం
ద్వారా
చంద్రబాబును
వచ్చే
శాసనసభ
బడ్జెట్
సమావేశాల్లో
ఇబ్బందులకు
గురి
చేసేందుకు
పూనుకున్నారు.
ముఖ్యమంత్రి
కిరణ్
కుమార్
రెడ్డి
ప్రభుత్వంపై
తమ
పార్టీ
శాసనసభా
పక్షం
అవిశ్వాస
తీర్మానం
ప్రతిపాదించాలని
నిర్ణయించినట్లు
కెసిఆర్
చెప్పారు.
తాము
ప్రతిపాదించే
అవిశ్వాసాన్ని
తెలుగుదేశం
పార్టీ
శాసనసభ్యులు
బలపరుస్తారా,
లేదా
తేల్చుకోవాలని
ఆయన
సవాల్
చేశారు.
తాము
శాసనసభా
సమావేశాలను
అడ్డుకుంటామని
ఆయన
చెప్పారు.
తెలుగుదేశం
పార్టీయే
కాంగ్రెసు
బ్రాంచీగా
పనిచేస్తోందని
ఆయన
వ్యాఖ్యానించారు.
తమపై
విమర్శలు
చేస్తున్న
తెలుగుదేశం
తెలంగాణ
నాయకులపై
ఆయన
తీవ్రంగా
మండిపడ్డారు.
తమను
కాంగ్రెసు
బ్రాంచీగా
తెలుగుదేశం
నాయకులు
అభివర్ణిస్తున్నారని,
తెలుగుదేశం
బ్రాంచీయో,
తమ
పార్టీ
బ్రాంచీయో
తేల్చుకోవడానికి
తాము
ప్రతిపాదించే
అవిశ్వాస
తీర్మానమే
నిదర్శనమని
ఆయన
అన్నారు.
తెలుగుదేశం
తెలంగాణ
ప్రాంత
నాయకులు
సొల్లు
పురాణం
చెబుతున్నారని
ఆయన
వ్యాఖ్యానించారు.
శ్రీకృష్ణ
కమిటీకి
తెలంగాణకు
అనుకూలంగా
లేఖ
ఇప్పించలేని
నాయకులు
తమపై
మాట్లాడుతున్నారని
ఆయన
అన్నారు.
తెరాసను
కలుపుకోవడానికి
కాంగ్రెసు
ప్రయత్నాలు
సాగుతున్నాయని
మీడియాలో
వస్తున్న
వార్తలపై
కూడా
ఆయన
తీవ్రంగా
మండిపడ్డారు.
మీడియాలో
వస్తున్నవి
పిచ్చి
పిచ్చి
రాతలు,
కారుకూతలు
అని
ఆయన
వ్యాఖ్యానించారు.
ఏకపక్షంగా
మీడియాలో
వార్తలు
ఇస్తున్నారని,
కనీసం
తమ
నుంచి
వివరణ
తీసుకోవాలనే
విషయాన్ని
కూడా
పట్టించుకోవడం
లేదని
ఆయన
అన్నారు.
TRS president K Chandrasekhar Rao came down heavely against TDP Telangana region leaders. He termed TDP as
branch of Congress. He challenged TDP to support no confidencem which would be proposed by TRS legislature
party in Assembly against CM kirankumar Reddy's Goverment.
Story first published: Friday, February 11, 2011, 17:38 [IST]