వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలేజీలకు ఫీజులు చెల్లించండి: ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Supreme Court
న్యూఢిల్లీ: ఫీజు రీయింబర్సుమెంట్స్ విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి అక్షింతలు వేసింది. కళాశాల యాజమాన్యాలకు ఫీజులు చెల్లించేందుకు మరో మూడు నెలలు గడువు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీం ప్రభుత్వం పిటీషన్‌ను తిరస్కరించింది. ప్రభుత్వం నిర్లక్ష్యానికి కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు అవస్థలు పడాలా అని ప్రశ్నించింది. ప్రభుత్వం ఫీజుల విషయంలో బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తోందన్నది. ప్రభుత్వం తన బాధ్యతను కాలేజీ యాజమాన్యాలపైకి నెట్టి వేయడం తగదన్నారు. మీకోసం యాజమాన్యం లోన్లు తెచ్చుకోవాలా అని ప్రశ్నించింది.

వారం రోజుల్లో పూర్తిస్థాయి అఫిడవిట్ సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను ఏమేరకు పాటించారో చెప్పాలని ఆదేశించింది. ఫీజుల విషయంలో కొన్ని అవకతవకలు జరిగాయని వాటిని సమీక్షుస్తున్నామని చెప్పిన ప్రభుత్వ వాదనను కోర్టు తప్పు పట్టింది. కాగా 9నెలలుగా ప్రభుత్వం పైసా కూడా చెల్లించలేదని ఇంజనీరింగ్ యాజమాన్యాలు చెబుతున్నాయి. 50 శాతం తక్షణమే చెల్లించాలని, మిగతా సగం ఏప్రిల్ మొదటి వారంలో చెల్లించాలని కోరారు. గత వారం ప్రభుత్వం, కళాశాల యాజమాన్యాలకు జరిగిన చర్చలు విఫలమవటంతో యాజమాన్యం సుప్రీంను ఆశ్రయించాయి.

English summary
Supreme Court expressed anguish at State Government on Fees reimbursements today. SC rejected Government petition. SC questioned, Why should managements should take take loans at the cost of Government fault.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X