హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ దీక్ష ఎఫెక్ట్!: ఫీజు రీయింబర్స్‌మెంట్స్ కోసం రూ.600 కోట్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరికతో కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం దిగి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వం 600 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్సు కోసం విడుదల చేయడానికి సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియను కూడా 18వ తేది లోపు పూర్తి చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. 16వ తేదీనే ఈ విషయమై ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా ఉంది. ఇంజనీరింగ్ కళాశాలలకు సుమారు 3800 కోట్ల రూపాయల బాకీ ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం 600 కోట్లను మాత్రం విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల వరలక్ష్మి అనే విద్యార్థిని మరణించిన సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్సుపై ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ నెల 18వ తేదిన ఒక్కరోజు దీక్షకు దిగుతానని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జగన్ ప్రకటించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సైతం ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై విద్యార్థులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని అనే అవకాశం ఇవ్వవద్దనే ఉద్దేశ్యంతోనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

English summary
Kiran Kumar Reddy government has effected by Ex MP YS Jagan warning on Fees Reimbursements. Government ready to release Rs.600 crores before 18th. Jagan decided to one day fast against government on this day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X