చిక్కుల్లో సోనియా: ఢిల్లీ నుంచి కదలమంటున్న తెలంగాణ ఎమ్మెల్యేలు

తెలంగాణ ఏర్పాటు చేసే వరకు పోరు ఆగదని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నాల ప్రభాకర్ చెప్పారు. తెలంగాణకు స్పష్టమైన ప్రకటన చేస్తేనే తాము గౌరవప్రదంగా ప్రజల వద్దకు వెళ్లగలుగుతామని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. తెలంగాణ కోసం తమ ప్రయత్నాలు తాము చేస్తున్నామని ఆయన అన్నారు. తెలంగాణపై ప్రకటన చేసే వరకు ఢిల్లీ నుంచి వెళ్లబోమని ఎమ్మెల్యేలు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమైందని పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం అన్నారు. ఇంత మంది శాసనసభ్యులు ఢిల్లీకి వచ్చిన తర్వాత ఫలితం ఎందుకు ఉండదని ఆయన ప్రశ్నించారు.
తాము తాడోపేడో తేల్చుకుంటామని, తెలంగాణకు అనుకూలంగా పార్టీ అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు తాము ఢిల్లీలోనే ఉంటామని శాసనసభ్యులు చెప్పారు. తమకు శాసనసభ బడ్జెట్ సమావేశాల కన్నా తెలంగాణ ముఖ్యమని వారంటున్నారు. స్పష్టమైన ప్రకటన చేస్తేనే తిరిగి వెళ్లిపోతామని వారు చెబుతున్నారు. సోనియా గాంధీని కూడా కలిసి తమ నిర్ణయాన్ని చెప్పాలని అనుకుంటున్నట్లు వారు తెలిపారు. రాజీనామాలు చేయడానికి కూడా తాము వెనకాడబోమని, ఆఖరి అస్త్రంగానే రాజనామాలను ప్రయోగిస్తామని వారు చెప్పారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications