హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇలా అయితే రాష్ట్రపతి పాలన, దాడి అమానుషం: ఎంపీలు రాయపాటి, లగడపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
హైదరాబాద్: ప్రజా ప్రతినిధులు ఇలాంటి దాడులకు పాల్పడితే రాష్ట్రపతి పాలన ఏర్పడే పరిస్థితి వస్తుందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావు గురువారం అన్నారు. ఇలా చేస్తే తెలంగాణ అంశం మరుగున పడిపోతుందని హెచ్చరించారు. గవర్నర్ నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. దాడుల వంటి చర్యలు రాష్ట్రపతి పాలనకు దారి తీస్తాయన్నారు. రాష్ట్రపతి పాలన వస్తే తెలంగాణ వాదులే నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం గానీ, జెపిపై దాడిగానీ సరికాదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాజకీయాల్లో మార్పు కోసం వచ్చిన జెపిపై ప్రజాప్రతినిధులే దాడి చేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి దాడులు మరోసారి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రబుత్వంపై ఉందన్నారు. కేంద్రం పరిధిలో ఉన్న అంశంపై దాడి చేయడం సరికాదన్నారు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉందన్నారు.

English summary
Vijayawada MP Lagadapati Rajagopal and Guntur MP Rayapati Sambasiva Rao condemned TRS attack on Jayaprakash Narayana today. Rayapati warned telanganites that president rule will be imposed, if the incidents repeat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X