అసెంబ్లీ నుంచి వారం రోజుల పాటు హరీష్ సహా 5గురి సస్పెన్షన్

Assembly
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల ప్రారంభం సమయంలో గురువారం గవర్నర్ నరసింహన్‌ ప్రసంగిస్తున్న సమయంలో అనుచితంగా ప్రవర్తించిన ఐదుగురు శాసనసభ్యులను శాసనసభ నుంచి ఉపసభాపతి నాదెండ్ల మనోహర్ ఏడురోజులపాటు సస్పెండ్ చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన వారు ముగ్గురు, తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఇద్దరు ఉన్నారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, విద్యాసాగర్‌రావు, సమ్మయ్య ఉండగా, టిడిపి నుండి రేవంత్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలు ఉన్నారు. రూల్ నెంబర్ 17ఏ కింద దౌర్జన్యంగా వ్యవహరించినందుకు వీరిపై చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. కాగా సస్పెన్షన్ అనంతరం సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ సభను సోమవారానికి వాయిదా వేశారు.

కాగా గవర్నర్‌పై టిడిపి, టిఆర్ఎస్ ప్రవర్తనను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఖండించారు. వారి ప్రవర్తన సరిగా లేనందునే సస్పెన్షన్ జరిగిందని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రవర్తన పునరావృతం కాకుండా ఉండాలంటే దౌర్జన్యంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే అన్నారు. సమస్యలు ఎన్నైనా ఉండవచ్చు అందుకు దాడులు పరిష్కారం కాదన్నారు. ఓటర్లు ఓట్లు వేసింది సభలో దౌర్జన్యంగా ప్రవర్తించడానికి కాదన్నారు. సభలో అనుచితంగా ప్రవర్తించినందుకే చర్యలు తీసుకున్నామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+