పార్లమెంటును తాకిన తెలంగాణ సెగ: ఫ్లకార్డుల ప్రదర్శన

కాగా అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె కేశవరావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావును తెలంగాణ కోసం తమతో కలిసి రమ్మంటే ఆయన మాత్రం రావడం లేదన్నారు. టిడిపి తెలంగాణ కోసం కాంగ్రెస్తో కలిసి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసిందని, ఇది తెలంగాణకు శుభపరిణామమని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలు తెలంగాణపై స్పష్టత కోసం వచ్చారని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవడానికి రాలేదన్నారు. కేంద్ర మంత్రులనుండి తెలంగాణపై స్పష్టమైన వైఖరి లేకుంటేనే సోనియాగాంధీని కలుస్తామని చెప్పారని, అయితే మంత్రులనుండి స్పష్టమైన వైఖరి లభించినందునే వారు సోనియాకాంధీని కలవలేదన్నారు.
టిఆర్ఎస్ సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారకరామారావు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విమర్శించడం సరికాదన్నారు. ఆయన ఆరోపించినట్లు వారు సోనియా అపాయింట్మెంట్ కోసం రాలేదని వివరణ ఇచ్చారు. అందరూ కలిసి పోరాడితేనే తెలంగాణ వస్తుందని అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ సమస్య పరిష్కారం కాదని, ఒత్తిడి తేవాలనుకుంటే న్యూఢిల్లీలో తీసుకు రావాలని ఆయన కేసిఆర్కు సూచించారు. సోనియా నాయకత్వాన్ని బలపరుస్తూనే నిరసన తెలిపాం అని చెప్పారు.
-
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications