రాజీనామా లేఖలతో ఢిల్లీకి కాంగ్రెసు తెలంగాణ శానసభ్యులు

Congress MLAs
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీనామా లేఖలతో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తమపై తీవ్రమైన ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో తెలంగాణ కోసం చేయాల్సిన భవిష్యత్తు పోరాటం చర్చించేందుకు వారు శుక్రవారం సమావేశమయ్యారు. తాజా పరిణామాలపై వారు చర్చించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే తాము రాజీనామాలు చేస్తామని చెప్పి సోనియాకు లేఖలు సమర్పించాలని వారు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మార్చి మొదటివారంలో వారు ఢిల్లీకి వెళ్లి సోనియాను కలవాలని అనుకుంటున్నారు.

కాగా, ఈ లోపల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు సోనియాకు లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. అలాగే, తెలంగాణ కోసం రాష్ట్ర శాసనసభ సమావేశాలను అడ్డుకోవడంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాససనభ్యులు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులతో పోటీ పడాలని కూడా వారు అనుకుంటున్నారు. సోమవారం నుంచి వారు రాష్ట్ర శాసనసభ సమావేశాలను అడ్డుకునే కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలున్నాయి.

కాగా, తెలంగాణపై మార్చిలో శుభవార్త వస్తుందని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి పి. శంకరరావు అన్నారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తమ పార్టీ నాయకులతో పాటు తెలుగుదేశం, తెరాస నాయకులను కూడా సంప్రదించిందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాస్తవం కాబోతోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+