వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెంగళూరులో ఉరేసుకున్న ఆంధ్రప్రదేశ్ టెక్కీ భార్య అనూష

ఈ సంఘటన మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో జరిగింది. బాత్రూంలో స్నానానికి వెళ్లిన అనూష ఎంతకీ బయటకు రాకపోవడంతో జయలక్ష్మి పిలిచింది. అయినా స్పందన రాకపోవడంతో కిటికీలోంచి చూసింది. అనూష శవం బాత్రూంలో దుపట్టాతో ఉరివేసుకుని కనిపించింది. వరకట్నం కోసం తన కూతురును రామకృష్ణ, అతని కుటుంబ సభ్యులు తీవ్రంగా వేధిస్తూ వచ్చారని అనూష తల్లి పద్మావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కూతురు అనూషకు తనిష్క పుట్టిన తర్వాత వారి ఒత్తిడి మరీ ఎక్కువైందని ఆమె చెప్పింది.