ఎమ్మెల్సీ ఎన్నికలు: చంద్రబాబు చిక్కుముడి, రంగంలో సిపిఐ అభ్యర్థి

తమ పార్టీ అభ్యర్థులు ముగ్గురు, సీపీఐ అభ్యర్థినీ గెలిపించుకునే విధంగా వ్యూహం రూపొందించామని తెదేపా నేతలు చెబుతున్నారు. తెదేపాకు మొత్తం 89 మంది ఎమ్మెల్యేలున్నారు. సీపీఐకి నలుగురు, సీపీఎంకు ఒకరున్నారు. మొత్తంగా మిత్రపక్షాల బలం 94. తెరాసకు 12 మంది ఎమ్మెల్యేల బలమే ఉందని, తమ అభ్యర్థుల్లో సతీష్రెడ్డికి 28 పోను... మిగతా ముగ్గురు అభ్యర్థులకు 22 చొప్పున ఓట్లు ఉంటాయని, దీంతో నలుగురూ గెలుస్తారని తెలుగుదేశం ధీమా వ్యక్తం చేస్తోంది. లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ తన ఓటును సీపీఐకి వేస్తారని సమాచారం. దీంతో సీపీఐ అభ్యర్థికి 23 ఓట్లు వస్తాయి. తద్వారా సిపిఐ అభ్యర్థికి మరో ఓటు ఎక్కువగానే ఉంటుందని భావిస్తున్నారు.
రాష్ట్ర విభజన డిమాండ్ అంశంపై తెరాస వైపు ఉంటుందని భావించిన సిపిఐ తెలుగుదేశం వైపు మళ్లింది. అయితే, కాంగ్రెసు ఐదో అభ్యర్థిని నిలబెడుతుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మిత్రపక్షాలకు చెందిన ఇద్దరు అభ్యర్థులను, తమ పార్టీకి చెందిన నలుగురు అభ్యర్థులను సులభంగా గెలుచుకునే బలం కాంగ్రెసుకు ఉంది. అయితే వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు క్రాస్ ఓటింగుకు పాల్పడితే తెరాస అభ్యర్థితో పాటు సిపిఐ అభ్యర్థి కూడా గెలిచే అవకాశాలున్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications