జూన్లో తెలంగాణ వస్తుందా, గ్రహాలు అనుకూలిస్తాయా?
కాగా, ములుగు రామలింగేశ్వర రావు అనే జ్యోతిష్య పండితుడు కచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని చెప్పారు. తెలంగాణపై మేలో ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు పూర్తయిన తర్వాత దృష్టి సారిస్తామని కాంగ్రెసు అధిష్టానం తమ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులకు హామీ ఇచ్చింది. బహుశా, ఈ హామీ వల్లనే కెసిఆర్ తెలంగాణ ఉద్యమం విషయంలో కాస్తా వెనక్కి తగ్గినట్లు భావిస్తున్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తెలంగాణలో ఆందోళనలు గుప్పుమనే పరిస్థితి ఉంది. ఈ స్థితిలోనే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూనే తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు కూడా కాంగ్రెసు అధిష్టానాన్ని కోరుతున్నారు.
తెలంగాణపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుండడంతో కాంగ్రెసు అధిష్టానం ఏదో ఒకటి తేల్చేయడానికే పూనుకుంటుందనేది అందరూ గట్టిగా నమ్ముతున్న విషయం. అయితే, కాంగ్రెసు కాలయాపన కోసం వివిధ పద్ధతులను ఎన్నుకుంటోంది. మళ్లీ కాలయాపన మంత్రాన్నే జపించే అవకాశాలు లేకపోలేదని కూడా అంటున్నారు. అయితే, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను, తెలంగాణలోని ఆందోళనలను, కాంగ్రెసుపై పెరుగుతున్న ఒత్తిడిని దృష్టిలో పెట్టుకుని జ్యోతిష్య పండితులు కూడా రాజకీయ విశ్లేషకుల మాదిరిగా అంచనాలు వేస్తూ ఉండవచ్చు. కానీ, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మనసులో ఏముందో మాత్రం ఎవరికీ తెలిసేట్లు లేదు.