హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెస్ వారి లక్ష్యం: జగన్ వర్గం ఎమ్మెల్యేలపై సిఎం కిరణ్ దాడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం కాంగ్రెసు శాసనసభ్యులపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు కాంగ్రెసు ఎమ్మెల్యేలు అధికార పార్టీని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. వారు పార్టీ అభ్యర్థిని ఓడించాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశారని అన్నారు. జానీకి జగన్ వర్గాన్ని కేటాయించినట్లు ముందుగానే అతనికి తెలియజేశామని చెప్పారు. జానీకి 27 ఓట్లు, రంగారెడ్డికి 22 ఓట్లు కేటాయించామని చెప్పారు. జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఎంఐఎంకు ఓటు వేస్తామని చెప్పడంతో కొద్దిగా మార్పులు, చేర్పులు చేశామని అన్నారు.

ఎన్నికకు ముందు జగన్ వర్గం ఎమ్మెల్యేలను ముగ్గురు, నలుగురిని మినహాయించి అందరినీ పిలిచి అడిగానని, వారంతా కాంగ్రెసు అభ్యర్థికే ఓటు వేస్తామని చెప్పారని అన్నారు. అయితే తర్వాత వారి తీరు కాంగ్రెసు ఓటమే అభిమతంగా కనిపిస్తోందన్నారు. కడప ఎన్నికల ప్రచారానికి జానీ వెళతారని చెప్పారు. శాసనమండలి ఎన్నికలు రాజ్యసభలా ఉంటే బావుంటుందని సిఎం అభిప్రాయపడ్డారు. ఈసీ దీనిపై పరిశీలన చేయాలని సూచించారు.

పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ను కలిసిన విషయంపై పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. గెలిచిన అభ్యర్థులు పార్టీకి కట్టుబడి ఉండాలన్నారు. పార్టీ చెప్పినట్టే నడుచుకోవాలన్నారు. కాంగ్రెసు నుండి 10 నుండి 12 ఓట్లు క్రాస్ అయ్యాయని చెప్పారు. కాగా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు తమకు ఓటు వేసిన విషయం తనకు తెలియదన్నారు.

English summary
Kiran Kumar Reddy fired at Ex MP YS Jaganmohan Reddy camp MLAs today. He accused their attitude in mlc election. He said that they targeted for congress defeat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X