చంద్రబాబుపై విరుచుకుపడిన వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు

తాము విచారణకు భయపడడం లేదని, అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి జరిగిన భూ కేటాయింపులపై విచారణ జరగాలని ఆమె అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే భూ కేటాయింపులు ప్రారంభించారని ఆమె అన్నారు. రహేజా విషయంలో ప్రభుత్వానికి నష్టం కలిగేలా చేసింది చంద్రబాబు నాయుడేనని ఆమె విమర్శించారు. రిలయన్స్ గ్యాస్ ద్వారా రాష్ట్రం లాభపడకుండా చేసి ఈనాడు దినపత్రిక అధినేత రామోజీ రావుకు లాభం చేకూరేలా చంద్రబాబు వ్యవహరించారని, చంద్రబాబు ఉదారత కారణంగానే రిలయన్స్ రామోజీ సంస్థలో పెట్టుబడులు పెట్టారని ఆమె అన్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్పై, రామోజీ ఫిల్మ్ సిటీలపై కూడా విచారణ జరగాలని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications