వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సత్య సాయిబాబా సజీవ సమాధి, సత్యసాయి ట్రస్టు ప్రకటిస్తుందా?
జీవించి ఉండగానే చైతన్యం పొందిన ఆత్మలు సమాధిలోకి వెళ్లిపోవడాన్ని సజీవ సమాధి చెందడం అంటారు. ట్రస్టు వ్యవహారాలపై చర్చించడానికి సత్యసాయి కేంద్ర ట్రస్టు సభ్యులు గురువారం అత్యవసరంగా సమావేశమైన నేపథ్యంలో సత్య సాయిబాబా సజీవ సమాధి పొందుతారనే ప్రచారం ఊపందుకుంటోంది. సత్యసాయిబాబా సోదరుడి కుమారుడు, ట్రస్టు సభ్యుడు రత్నాకర్కూ ఇతర సభ్యులకు మధ్య విభేదాల కారణంగా కూడా ఆ ప్రచారం జరుగుతున్నట్లు చెబుతున్నారు.
సత్య సాయిబాబా ఆరోగ్యం క్షీణిస్తుండడంపై, బాబాకు అందిస్తున్న వైద్యంపై శ్రీసత్య సాయిబాబా భక్తుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ట్రస్టు సభ్యుల వ్యవహార శైలిపై సంఘం అధ్యక్షుడు ధనంజయ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, పుట్టపర్తిలో ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది. పెద్ద యెత్తున బలగాలను దింపింది.
Comments
sathya saibaba puttaparthi ananthapur sathya sai trust సత్య సాయిబాబా పుట్టపర్తి అనంతపురం సత్య సాయి ట్రస్టు
English summary
With Sathya Sai Baba’s health condition fast approaching the tipping point, speculation is rife that the Sai Trust may chose to declare that the spiritual leader has entered “Sajeeva Samadhi”.
Story first published: Thursday, April 21, 2011, 18:02 [IST]