అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విషమిస్తున్న ఆరోగ్యం నేపథ్యంలో నేడు సత్య సాయి ట్రస్టు సమావేశం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
పుట్టపర్తి: సత్య సాయిబాబా ఆరోగ్య పరిస్థితులపై వైద్యుల ప్రకటనల నేపథ్యంలో గురువారం సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఇతర ప్రాంతాల్లో ఉన్న ట్రస్టు సభ్యులను పుట్టపర్తికి పిలిపిస్తున్నట్లు సమాచారం. ట్రస్టు కార్యదర్శి చక్రవర్తి, సభ్యులు ఎస్వీ గిరి, రత్నాకర్‌ పుట్టపర్తిలోనే ఉన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న సభ్యులు ఇందులాల్‌షా, జస్టిస్‌ భగవతి, శ్రీనివాసన్‌లు గురువారం రానున్నారు. ట్రస్టు ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు నాగానంద, జేవీ శెట్టి, భగవత్‌లకు సమాచారం పంపినట్లు తెలిసింది.

పుట్టపర్తిలో జరిగే ట్రస్టు సమావేశానికి రాష్ట్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి. సత్య సాయిబాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్లు, చికిత్స ద్వారా ప్రాణాలు నిలబెట్టడం సాధ్యం కానట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో ఏం చేయాలనే విషయంపై చర్చించేందుకు సత్య సాయి ట్రస్టు అత్యవసరంగా సమావేశమవుతున్నట్లు తెలుస్తోంది. సత్య సాయిబాబా భక్తుల్లోని ప్రముఖులు హైదరాబాదులో సమావేశమయ్యారు.

English summary
Sathya Sai trust meeting to be held to at Puttaparthi. Trust members were invited to Puttaparthi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X