ఎవరీ సత్యజిత్, పుట్టపర్తి సత్య సాయి బాబాకు ఎలా దగ్గరయ్యారు?

తమిళనాడుకు చెందిన సత్యజిత్ పుట్టపర్తి విద్యాసంస్థలోనే ఎల్కెజి నుంచి ఎంబిఎ వరకు చదివారు. గత పదేళ్లుగా ఆయన సత్య సాయి బాబాతో ఉంటున్నారు. 2003 జూన్ 4వ తేదీన సత్య సాయిబాబా బాత్రూంలో పడిపోయిన సంఘటన వారిద్దరి మధ్య బంధాన్ని పటిష్టం చేసింది. చికిత్స జరుగుతున్నప్పుడు 24 గంటలూ బాబాను అంటి పెట్టుకునే ఉన్నారు. బ్రహ్మచారి అయిన సత్యజిత్ బాబాతో పాటు యజర్ మందిర్లోనే ఉండేవాడు. బయటకు వెళ్లినప్పుడు కూడా బాబా వెంటే ఉండేవారు. దీంతో అనతి కాలంలోని ప్రశాంతి నిలయంలో సత్యజిత్ శక్తివంతమైన వ్యక్తిగా మారిపోయారు.
సత్య సాయిబాబాకు గంజిలో నిద్ర మాత్రలు ఇచ్చేవారని, ఇందులో సత్యజిత్ కుట్ర ఉందని, దాంతో సత్య సాయిబాబా ఆరోగ్యం చెడిపోయిందని, ఆరోగ్యం చెడిపోయినా బాబాకు వైద్య సేవలు అందించలేదని బాబా ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో సత్యజిత్కు వ్యతిరేకంగా ఆశ్రమవాసులు, భక్తులు స్పందించడం ప్రారంభించారు. ఆయనకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ఈ స్థితిలో బాబా వ్యక్తిగత వైద్యుడు అయ్యర్కు, సత్యజిత్కు భద్రత కల్పించారు. ముందు జాగ్రత్త చర్యగా ట్రస్టు సభ్యులందరికీ భద్రత కల్పించారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications