చిరంజీవికి అధిష్టానం మెగా ఆఫర్: ఢిల్లీకి రమ్మని కాంగ్రెసు పిలుపు

Chiranjeevi
హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి కాంగ్రెసు పార్టీ మెగా ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం హఠాత్తుగా కాంగ్రెసు పార్టీ అధిష్టానం నుండి చిరంజీవికి పిలుపు వచ్చింది. వెంటనే ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం ఆదేశించడంతో చిరంజీవి సాయంత్రం 6 గంటలకు బయలుదేరి వెళ్లనున్నారు. చిరంజీవికి సిడబ్ల్యుసిలో పదవి వస్తుందని ప్రచారం జరిగిన రోజునే అధిష్టానం నుండి పిలుపు రావడం దానిని మరింత బలపరుస్తుంది. చిరంజీవి బుధవారం మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్, గులాం నబీ ఆజాద్‌తో భేటీ కానున్నారు. అనంతరం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీతో కూడా భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

చిరంజీవి ఢిల్లీ పర్యటనలో అనేక రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసు పార్టీలో విలీనం చేసే బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో పాటు పీఆర్పీని మంత్రివర్గంలో చేరే అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. విలీన సభకు సోనియాగాంధీని కూడా చిరంజీవి ఆహ్వానించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే చిరంజీవిని ఢిల్లీ పిలిపించడం వెనుకు మరో కోణం కూడా ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నెల 13న కడప, పులివెందుల ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రజల దృష్టి అటు పడకుండా ఉండటానికే చిరంజీవిని ఢిల్లీకి రమ్మని ఉంటారని అంటున్నారు.

చిరంజీవి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణ, విలీనంతో పాటు చిరంజీవికి ఇచ్చే పదవిపై కూడా అధిష్టానం ఓ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో చిరుకు ఏదైనా ముఖ్య పదవి కట్టబెడితే సీనియర్లు ఊరుకుండే పరిస్థితి లేదు కాబట్టి సిడబ్లుసిలోకి తీసుకునే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+