ఆదిలాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వెనక్కి తగ్గిన వేణుగోపాలాచారి, పార్టీ అధినేత చంద్రబాబుతో భేటీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Venugopalachari
హైదరాబాద్‌: తెలంగాణపై తిరుగుబాటు విషయంలో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పార్టీ నాయుకుడు వేణుగోపాలాచారి వెనక్కి తగ్గారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నాగం జనార్దన్ రెడ్డితో పాటు తెలంగాణ అంశంపై చంద్రబాబు మీద ఆయన తిరుగుబాటుకు ముందుకు వచ్చారు. అయితే, నాగం జనార్దన్ రెడ్డిపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు చర్యలు తీసుకునేందుకు సంసిద్ధమైన నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. వేణుగోపాలాచారి బుధవారం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు.

తాను పార్టీ నిర్ణయాలకు లోబడి పని చేస్తానని వేణుగోపాలాచారి చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం. నాగం జనార్దన్ రెడ్డితో పాటు నడవడానికి రంగారెడ్డి జిల్లా పరిగి శాసనసభ్యుడు హరీశ్వర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన శాసనసభ్యుడు జోగు రామన్న కూడా నాగం వెంట వెళ్లడానికి సిద్ధపడినట్లు ప్రచారం జరుగుతోంది. వేణుగోపాలాచారి కూడా వారి వెంట ఉంటారని భావించారు. అయితే ఆయన వెనక్కి తగ్గి చంద్రబాబుకు తన విధేయతను ప్రకటించారు.

English summary
TDP Adilabad district leader Venugopalachari met party president N Chandrababu naidu and announced his loyality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X