వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వారిలా మేం పార్టీ నడపడం లేదు: జగన్, కెసిఆర్‌పై చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి, అధికార కాంగ్రెసు పార్టీ, వైయస్ జగన్‌కు చెందిన వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీపైన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఆదివారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. మూడు రోజుల మహానాడులో భాగంగా చివరి రోజు ఆయన పంచె కట్టుతో వచ్చారు. అనంతరం ఆయన వివిధ పార్టీల తీరును దుయ్యబట్టారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిలా అవినీతితో లక్ష కోట్లు సంపాదించి తాము పార్టీ నడపటం లేదని, టిఆర్ఎస్ పార్టీలా బెదిరింపులకు పాల్పడి డబ్బులను వసూలు చేయడం లేదని, కాంగ్రెసు పార్టీలా అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించి పంపిణీ చేయడం తమకు తెలియదని కేవలం ప్రజల విరాళాలతో నడుస్తున్న పార్టీ కేవలం తెలుగుదేశం పార్టీయే అన్నారు.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు, యువతకు తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. రాజకీయాల్లో నూతన ఒరవడికి యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో నైతిక విలువల పరిరక్షణకైనా యువత ముందుకు రావాలని సూచించారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు తమకు తెలియవని అన్నారు. కాగా ఎన్నికల సంస్కరణపై మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ తీర్మానం ప్రవేశ పెట్టారు.

English summary
TDP president Chandrababu Naidu blamed YS Jagan, K Chandrasekhar Rao and Congress for running their partys.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X