హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోజా చరిత్ర హీనురాలు, లక్ష్మీపార్వతితో పార్టీ తుడిచి పెట్టుకు పోయేది

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడును విమర్శించిన ఎన్టీఆర్ టిడిపి అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి, వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి రోజాపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు కోళ్ల లలితా కుమారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ పార్టీ అధినేతను విమర్శించే స్థాయి వారికి లేదన్నారు. రోజా చరిత్ర హీనురాలన్నారు. ఆమె మన రాష్ట్రానికి చెందిన మరో కనిమొళిలా తయారయిందని ఆరోపించారు.

లక్ష్మీపార్వతి ప్రవర్తనతో దివంగత నందమూరి తారక రామారావు ఆత్మ క్షోభిస్తుందన్నారు. ఆనాడు పార్టీ దుష్టశక్తుల చేతిలోకి వెళ్లకుండా కాపాడటానికే ఎన్టీఆర్ నుండి చంద్రబాబు పగ్గాలు తీసుకున్నందువల్లే పార్టీ మంచి స్థాయిలో ఉందన్నారు. ఆనాడే దుష్టశక్తుల చేతికి వెళ్లి ఉంటే టిడిపి ఎప్పుడో తుడిచి పెట్టుకు పోయేదన్నారు.

English summary
TDP MLA Kolla Lalitha Kumar blamed Roja and Laxmi Parvathi today. She said Roja is another Kanimozhi for state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X