జగన్ వర్గం డైలమా: ఖాళీ బ్యాలెట్టా, ఆత్మప్రబోధానుసారం ఓటా?

ఎమ్మెల్యేల భేటీలో పాల్గొన్న జగన్ కూడా ఖాళీ బ్యాలెట్ వాదనకు మద్దతిచ్చినట్లు సమాచారం. ఈ వ్యూహంలో సాంకేతికతలపై పలువురికి అనుమానాలు ఉండటంతో శనివారం ఉదయం 8 గంటలకు మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలంటే తెలుగుదేశం అభ్యర్థికి ఓటేయాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆ ఆలోచన వద్దని అనుకున్నట్లు తెలిసింది. సభాపతి ఎన్నిక సజావుగా పూర్తయితే తమ శిబిరంలో ఉన్న పలువురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని, ఇది తమ బలాన్ని తగ్గిస్తుందని జగన్ వర్గంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
తెలుగుదేశం పార్టీ ఇప్పటికిప్పుడు అవిశ్వాస తీర్మానం అంశాన్ని తెరపైకి తేవడంపై కూడా సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. శనివారం శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం లేదని, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక, వారి గురించి మాట్లాడడంతోనే సమయం గడుస్తుందని, తెలుగుదేశం అవిశ్వాసం కోసం పట్టుపట్టినా ప్రభుత్వం ఇప్పటికిప్పుడు చర్చకు సిద్ధమయ్యే పరిస్థితి కనిపించడం లేదని నాయకులు అభిప్రాయపడినట్లు తెలిసింది. అందుకే, తాముకూడా అవిశ్వాస తీర్మానం కోసం పట్టుబట్టాలని నిర్ణయించారు. అవిశ్వాస తీర్మానం పెడితే బలాన్ని చూపిద్దామని జగన్ చెప్పినట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి శనివారం జరిగే పరిణామాల ఆధారంగా అప్పటికప్పుడు వ్యూహాన్ని రచించాలని, ముఖ్య నేతలంతా శనివారం సమావేశం కావాలని నిర్ణయించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications