హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వారిది ఈటింగ్, మీటింగే: కాంగ్రెసు ఎంపీలపై దేవేందర్ గౌడ్ ధ్వజం

By Pratap
|
Google Oneindia TeluguNews

Devender Goud
హైదరాబాద్‌: ఈటింగ్‌, మీటింగ్‌ తప్ప కాంగ్రెస్‌ పార్లమెంటు సభ్యులు తెలంగాణ కోసం చేసిందేమీ లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత దేవేందర్‌గౌడ్‌ విమర్శించారు. కాంగ్రెస్‌ నేతలు ఏర్పాటు చేసుకుంటున్న సమావేశాలన్నీపొద్దుపోకేనని ఎద్దేవాచేశారు. సమావేశం ఏర్పాటుచేసుకోవడం, అది ముగియగానే భోజనాలు చేయడం ఆపై ప్రకటనలు చేయడం మినహా తెలంగాణకోసం చేస్తున్న దేమిటని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తాండూరులో నిర్వహించనున్న తెలంగాణ రణభేరి సభను అడ్డుకోవాలని ఇచ్చిన ప్రకటనను ఉప సంహరించుకోవాలని తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. రేపు తాండూరులో నిర్వహించే సభలో విధ్వంసం సృష్టించేందుకు టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఆయన విడిగా మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు.తాండూరు సభలో ఏ దురదృష్టకర ఘటన జరిగినా అందుకు అందుకు కేసీఆర్‌, కోదండరాం బాధ్యత వహించాలని ఫోరం నేతలు అన్నారు. కేసీఆర్‌ కుట్రలో పావులుగా మారొద్దంటూ విద్యార్థులకు, జేఏసీకి విజ్ఞప్తి చేశారు.

English summary
Telugudesam senior leader Devender Goud lashed out at Congress Telangana MPs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X