రాజీనామాలకు సై అన్న కిషన్ రెడ్డి, కెసిఆర్ ఫోన్

Kishan Reddy
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రెండో రోజూ రాజీనామాల పరంపర కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సిపిఐ శాసనసభ్యులు రాజీనామాకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర శాసససభ్యులు, సస్పెండ్‌కు గురైన శాసనసభ్యులు సైతం మంగళవారం రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. తాజాగా భారతీయ జనతా పార్టీ కూడా రాజీనామాలకు సిద్ధమని ప్రకటించింది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డికి టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఫోన్ చేశారు. సామూహికంగా రాజీనామాలు చేద్దామని సూచించారు. దానికి కిషన్ రెడ్డి సై అన్నారు. తెలంగాణ కోసం అవసరమైతే రాజీనామాకు వెనుకాడేది లేదని కిషన్ రెడ్డి కెసిఆర్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది. బిజెపికి రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిద్దరూ తెలంగాణ ప్రాంతం నుండే ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి, మరొకరు పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌ను ఓడించిన యెండల లక్ష్మీ నారాయణ.

కాంగ్రెసు, టిడిపి రాజీనామాలు చేయడం, సిపిఐ, టిఆర్ఎస్ రాజీనామాలకు సిద్ధపడిన నేపథ్యంలో కిషన్ రెడ్డి పార్టీ అధిష్టానంతో మంగళవారం మాట్లాడినట్లుగా తెలుస్తోంది. రాజీనామాలకు అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు కిషన్ రెడ్డి, లక్ష్మీ నారాయణ సభాపతిని కలవనున్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2.30 గంటలకు టిఆర్ఎస్ రాజీనామాలు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+