వైయస్ జగన్ ఎమ్మెల్యేల ధిక్కారం, నో యాక్షన్

బొత్స సత్యనారాయణ పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పరిస్థితిలో మార్పు వస్తుందని అందరూ భావించారు. జగన్ వెంట నడుస్తున్న శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటుందని భావించారు. ఆయన దూకుడు చూస్తుంటే అలా అనిపించింది కానీ అటువంటిదేమీ లేదని తేలిపోయింది. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు మారితే పార్టీ గాడిలో పడుతుందని అనుకున్నారు. గాడిలో పడకపోగా మరింత విచ్చలవిడితనం పెరిగిపోయింది. కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేయకుండా మరో పార్టీ ప్లీనరీకి వెళ్లే ధైర్యం చేశారంటే నాయకత్వ బలహీనత కూడా వైయస్ జగన్ వెంట నడుస్తున్న కాంగ్రెసు శాసనసభ్యులకు పూర్తిగా తెలిసిపోయినట్లే ఉంది.
ప్లీనరీలో పాల్గొనడమే కాదు, వైయస్సార్ పార్టీని సొంతం చేసుకుంటూ కొంత మంది మాట్లాడారు. ప్రజారాజ్యం పార్టీ శానససభ్యురాలు శోభా నాగిరెడ్డి, కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ, కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి వేదికపై నుంచి మాట్లాడారు కూడా. తెలంగాణ ప్రజాప్రతినిధుల రాజీనామాలు, వైయస్ జగన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే తిరుగుబాటు చూస్తుంటే కాంగ్రెసు పార్టీ నాయకత్వ అసమర్థత స్పష్టమవుతోందని అంటున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications