కేబినెట్ విస్తరణపై బొత్సతో విభేదించిన రోశయ్య

Rosaiah
హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగానే రాష్ట్రానికి మంత్రి పదవులు సరిగా కేటాయించలేదని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మంగళవారం అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రివర్గంలో మరో ఇద్దరికైనా రాష్ట్రం నుండి పదవులు దక్కవలసి ఉండెనని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం నుండి ఏదైనా అధికారిక ప్రకటన వస్తే తాము ఆలోచిస్తామని చెప్పారు. తెలంగాణపై ప్రతిపాదనల గురించి తనకు ఇప్పటి వరకు ఏమీ తెలియదన్నారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నందు వల్లే రాష్ట్రానికి మరిన్ని పదవులు దక్కలేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అనిశ్చితి పరిస్థితికి తెరపడిన తర్వాత మరిన్ని పదవులు వస్తాయని ఆయన అన్నారు. కాగా అనిశ్చితికి మంత్రి పదవులకు ఎలాంటి సంబంధం లేదని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పగా రోశయ్య మాత్రం అనిశ్చితే కారణం అని చెప్పారు.

కాగా సమైక్యాంధ్రనే ఉంచాలని కోరుతూ ఈ నెల సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులం 17న ఢిల్లీ వెళుతున్నామని మంత్రి శైలజానాథ్ వేరుగా చెప్పారు. చెప్పారు. 18వ తారీఖు నుండి 20వ తారీకు వరకు ఢిల్లీలోనే ఉంటామని సమైక్యాంధ్రనే ఉంచాలని అధిష్టానాన్ని కోరతామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం వేసిన శ్రీకృష్ణ కమిటీలోని ఆరవ ప్రతిపాదనను అమలు చేయాలని అధిష్టానాన్ని కోరతామని చెప్పారు. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధుల రాజీనామాలపై తాను స్పందించనని చెప్పారు. వారి రాజీనామాల విషయం అధిష్టానమే చూసుకుంటుందని చెప్పారు. ఆగస్టు 15వ తేది వరకు ప్రతి విద్యార్థికి రెండు జతల బట్టలు అందిస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+