కావూరిని మన్మోహన్ సింగ్ ఎందుకు పక్కన పెట్టారు?

కావూరి సాంబశివరావును మంత్రివర్గంలోకి తీసుకుంటే తెలంగాణ నేతల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించినట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తామంతా రాజీనామాలు చేసిన నేపథ్యంలో సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర నాయకులకు నాయకత్వం వహిస్తున్న కావూరిని తీసుకోవడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమయ్యే అవకాశాలున్నట్లు భావించారు. అంతేకాకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి మంత్రివర్గంలో ఉన్నారు. అదే వర్గానికి చెందిన కావూరికి మంత్రి పదవి ఇస్తే ఇతర సామాజిక వర్గాలు నొచ్చుకునే ప్రమాదం ఉందని కూడా గ్రహించినట్లు చెబుతున్నారు.
పైగా, కిశోర్ చంద్రదేవ్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని మొదటి నుంచి ప్రధానితో పాటు సోనియా కూడా భావిస్తున్నారు. నిజానికి, ఆయనకు లోకసభ స్పీకర్ పదవి దక్కాల్సింది. స్పీకర్ పదవికి మీరా కుమార్ను ఎంపిక చేయడంతో ఆయనకు మంత్రి పవి ఇవ్వాలని అనుకున్నారు. అయితే, అప్పట్లో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సాయిప్రతాప్ పేరు సూచించడంతో కిశోర్ చంద్రదేవ్ను పక్కన పెట్టారు. ఇప్పుడు సాయిప్రతాప్ చేత రాజీనామా చేయించి, కిశోర్ చంద్రదేవ్కు స్థానం కల్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications