వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు తమ్ముళ్ల బాహా బాహీ, యాత్రకు మోత్కుపల్లి దూరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telugudesam
నల్గొండ: జిల్లాలో తెలుగు తమ్ముళ్లు బాహా బాహీకి దిగారు. ఇరువర్గాలు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అంటూ తెలంగాణ తెలుగుదేశం పార్టీ చేపట్టన బస్సు యాత్ర నల్గొండ జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసింది. బుధవారం నల్గొండ జిల్లాలో తెలుగుదేశం పార్టీ బస్సుయాత్ర ప్రవేశించింది. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. బస్సుయాత్ర జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంలో టిడిపి జిల్లా పార్టీ నేతలు అయిన సంకినేని వెంకటేశ్వర రావు, సుదర్శన్‌ వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఇరు వర్గాలు ఒకరి ఫ్రెక్సీలను ఒకరు చించి వేశారు. పోస్టర్లను తొలగించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

కాగా మోత్కుపల్లి నరసింహులు నల్గొండ జిల్లాలోని బస్సుయాత్రకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మోత్కుపల్లికి వ్యతిరేక వర్గం అయిన సంకినేని వెంకటేశ్వరరావుకు అనుకూలంగా బస్సుయాత్ర ఉండటంతో మోత్కుపల్లి తీవ్ర అసంతృప్తికి లోనైనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన యాత్రకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ నేతలు ఆయనను బుజ్జగిస్తున్నట్లు సమాచారం.

English summary
Tension take place in Nalgonda district today. Tension take place between Sankineni and Sudarshan camp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X