సత్య సాయి బాబా స్థాపించిన శివంలో దొంగతనం

వాచ్మెన్ ఉన్నప్పటికీ దొంగతనం జరగడం విశేషం. సత్య సాయి బాబా వెండి పాదుకలతో పాటు అర్చనకు సంబంధించిన హారతి పల్లెం తదితర వెండి వస్తువులు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు. ట్రస్టు సభ్యులు ఉదయం వచ్చి చూసి దొంగతనం జరిగినట్లుగా గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి శివం కూతవేటు దూరంలో ఉంది. ఉస్మానియాలో చోటు చేసుకున్న ఉద్రిక్తల నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు శివం పరిసర ప్రాంతాలలోనే మోహరించి ఉన్నప్పటికీ దొంగతనం జరగడం గమనార్హం.












Click it and Unblock the Notifications