హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య సాయి బాబా స్థాపించిన శివంలో దొంగతనం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Theft in Sivam
హైదరాబాద్: నల్లకుంటలో ఉన్న శివంలో బుధవారం అర్దరాత్రి భారీ చోరీ జరిగింది. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చెన్నై, ముంబయి, హైదరాబాదులలో సత్యం, శివం, సుందరం పేరిట ఆలయాలు నిర్మించిన విషయం తెలిసిందే. శివంను హైదరాబాదులో నిర్మించారు. రాష్ట్రంలో పుట్టపర్తి తర్వాత శివంకు ప్రాధాన్యత ఉంది. అలాంటి శివంలో బుధవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. ఈ దొంగతనం అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి గురువారం ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో జరిగినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వాచ్‌మెన్ ఉన్నప్పటికీ దొంగతనం జరగడం విశేషం. సత్య సాయి బాబా వెండి పాదుకలతో పాటు అర్చనకు సంబంధించిన హారతి పల్లెం తదితర వెండి వస్తువులు దొంగిలించినట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తి సమాచారం ఇంకా తెలియరాలేదు. ట్రస్టు సభ్యులు ఉదయం వచ్చి చూసి దొంగతనం జరిగినట్లుగా గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి శివం కూతవేటు దూరంలో ఉంది. ఉస్మానియాలో చోటు చేసుకున్న ఉద్రిక్తల నేపథ్యంలో భారీగా పోలీసు బలగాలు శివం పరిసర ప్రాంతాలలోనే మోహరించి ఉన్నప్పటికీ దొంగతనం జరగడం గమనార్హం.

English summary
A theft take place in Sivam yesterday night. Thief's theft Baba's padukalu and pooja items.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X