నింగికెగిసిన పిఎస్ఎల్వీ - సి17, కక్ష్యలోకి జిశాట్ 12

ISRO Logo
నెల్లూరు: శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుక్రవారం సాయంత్రం 4.48 నిమిషాలకు పీఎస్‌ఎల్‌వీ-సి17 రాకెట్‌ను ప్రయోగించింది. నాలుగు దశల్లో ఇది విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. 1410 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహం జీశాట్‌-12ను ఇది నింగిలోకి మోసుకెళ్లింది. జీశాట్‌-12 ఎనిమిదేళ్లపాటు సేవలు అందించనుంది. రూ. 200 కోట్లతో ఈ ప్రయోగాన్ని షార్‌ చేపట్టింది. రాకెట్‌ ప్రయోగానికి ముందు బుధవారం మధ్యాహ్నం 12.18 నుంచి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది.

జీశాట్ -12 నిర్దిష్ట కక్ష్యలోకి చేరుకున్నట్లు ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ చెప్పారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రజ్ఞుల్లో ఆనందం అంబరాన్ని అంటింది. జిశాట్ -12 ఉపగ్రహం వల్ల సమాచార వ్యవస్థ మరింత మెరుగుపడుతుంది. ఇది 200 కోట్ల రూపాయల ప్రాజెక్టు. ఈ ఉపగ్రహాన్ని విద్య, టెలిఫోన్, టెలిమెడిసిన్ సర్వీసులకు వాడుకుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+