లగడపాటిపై విరుచుకుపడిన వైయస్ జగన్ వర్గం
లగడపాటి వైఎస్ కుటుంబ విషయాలు మాట్లాడకుండా ఉంటే మంచిదన్నారు. ఆ విషయాలను ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ గానీ, వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ గానీ చెబితే నమ్ముతారన్నారు. లగడపాటి చెబితే నమ్మడానికి ఈ రాష్ట్రంలో ఎవరూలేరన్నారు. కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలలో ఒకరైన జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ కూడా ఆ నాడు ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఇక పనికిరాదని చెప్పి ఇందిరా కాంగ్రెస్ అనే కొత్తపార్టీని పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే జగన్ కూడా కాంగ్రెస్ పార్టీ చేయని పనులను చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా ఇతర పత్రికలు వార్తలు రాస్తే స్పందించని లగడపాటి ఇప్పుడు ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఎవరికి బుద్ది చెబుతారో ఆ రోజు కోసం తాను కూడా ఎదురు చూస్తున్నానన్నారు. ఆ రోజు 2014కు ముందే రావాలని తాను కోరుకుంటున్నట్లు హరి చెప్పారు.