ఏ క్షణంలోనైనా మధ్యంతర ఎన్నికలు: చంద్రబాబు

కాంగ్రెసు పార్టీ పూర్తి అవినీతిలో కూరుకు పోయిందన్నారు. అవినీతిని రూపు మాపడానికి అన్నాహజారే వంటి వారు ముందుకు వచ్చారన్నారు. కేంద్రం అవినీతిపై స్పందించే పరిస్థితిలో లేదన్నారు. ఆర్థిక ఫలాలు పేదలకు అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా కార్యకర్తలు పని చేయాలని సూచించారు. తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీ చెప్పాల్సింది చెప్పిందని నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications