కుక్కలు చింపిన విస్తరిగా మారిన రాష్ట్ర రాజకీయాలు!
ఆజాద్ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించలేదని ఆయనే వక్రబుద్ధితో మాట్లాడారని ధ్వజమెత్తారు. షరతులతో కూడిన ఒప్పందం మేరకే 1954లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన విషయాన్ని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలనే ఆనాడు పదవులు, బడ్జెట్ కేటాయింపులు, ఉద్యోగుల నిష్పత్తి, మంత్రి పదవులు, అభివృధ్ధి మండలి ఏర్పాటు తదితర అంశాలపై నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పాలకులు వాటిని విస్మరించటంతోనే సమస్య పెద్దదైందని చెప్పారు.
ఓవైపు తెలంగాణ, మరోవైపు సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడుతూంటే వాటిని ఆర్పే ప్రయత్నం చేయకుండా ఇరు ప్రాంతాల కాంగ్రెస్ నేతలు రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుంభకోణాల్లో కూరుకుపోయాయి. సాక్ష్యాధారాలతో సహా నిరూపించటానికి సిద్ధంగా వున్నా. ఒకవేళ నిరూపించలేకపోతే ఉరేసుకుని చస్తా. ఈ సవాల్ కు సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లు సిధ్ధమేనా ? అని కూడా నారాయణ సవాల్ విసిరారు.