హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ప్రాంత నేతలను తప్పుపట్టిన రోశయ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: తమ సమస్యకు పరిష్కారం వెంటనే కావాలని అడగటం సరికాదని మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గురువారం సిఎల్పీ కార్యాలయంలో మాట్లాడుతూ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో సమస్య వెను వెంటనే పరిష్కారం అడగటం కాకుండా ఫలితం కావాలని అడగాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అంశాన్ని పరిష్కరించడానికి తీవ్రంగా కృషి చేస్తుందన్నారు. త్వరలో తెలంగాణ అంశం పరిష్కారం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం అభిప్రాయం ఎక్కువ మందికి ఆమోదయోగ్యంగా ఉంటుందన్నారు.

ఇరు ప్రాంతాల నేతలు తమ తమ మాటల తీవ్రత తగ్గించాలని సూచించారు. ఉద్రిక్తలు పెంచుకుంటూ పోతే అనర్థాలకు దారి తీస్తుందన్నారు. డిసెంబర్ 9న తప్పుడు నివేదికలు పంపారని కేంద్ర నేతలు ఎవరూ చెప్పలేదన్నారు. ప్రణబ్ ముఖర్జీ తప్పుడు నివేదికలు పంపారని చెప్పలేదన్నారు. న్యూఢిల్లీలో ఆత్మహత్య చేసుకున్న యాదిరెడ్డి కుటుంబానికి ఆయన సంతాపం వ్యక్తం చేశారు. సాధ్యమైనంత త్వరగా తెలంగాణ పరిష్కారం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

English summary
Former CM Rosaiah opposed Telanganites requests on Telangana. He suggested the to give time to central government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X