గడువు అడిగిన ఆజాద్, లేదన్న తెలంగాణ ఎంపీలు

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య పరిష్కారానికి తమకు రెండు నెలల గడువు ఇవ్వాలని, రాజీనామాలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ తెలంగాణ పార్లమెంటు సభ్యులను కోరారు. ఆగస్టు 1వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆజాద్ ఆ విజ్ఢప్తి చేశారు. అయితే తెలంగాణ పార్లమెంటు సభ్యులు రాజీనామాలు ఉపసంహరించుకోవడానికి నిరాకరించారు. తెలంగాణపై స్పష్టత వచ్చే వరకు రాజీనామాలు ఉపసంహరించుకోబోమని వారు చెప్పారు. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ, బలరాం నాయక్, సురేష్ షేట్కర్ శుక్రవారం గులాం నబీ ఆజాద్‌తో సమావేశమయ్యారు. స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు రాజీనామాలు వెనక్కి తీసుకునేది లేదని తాము స్పష్టం చేసినట్లు మధు యాష్కీ సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు.

మన్యసీమ రాష్ట్ర ఏర్పాటు గురించి తనను ఎవరూ సంప్రదించలేదని బలరాంనాయక్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనకే తన మొదటి ప్రాధాన్యం ఉంటుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనుల సమస్యలు పరిష్కారమవుతాయని, మన్యసీమ ప్రత్యేక రాష్ట్రం అవసరం లేదని ఆయన అన్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ అధిష్టానం సుముఖంగా ఉందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో చెప్పారు. నదీజలాలు, హైదరాబాదు సమస్యలు మాత్రమే ఆటంకాలుగా ఉన్నాయని, వాటిపై చర్చలు జరిగి సమస్య పరిష్కారమవుతుందని ఆయన అన్నారు. తమను ఆజాద్ ఢిల్లీకి పిలిచిన మాట వాస్తవమేనని, అయితే రాజీనామాలు వెనక్కి తీసుకోవాలని అడగలేదని ఆయన చెప్పారు. సోమవారం మరోసారి ఢిల్లీలో తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఆజాద్‌తో సమావేశం కానున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+