వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టి-కాంగ్రెసుపై ఆజాద్ ఒత్తిడి: నో అంటున్న నేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: ఆగస్టు 1వ తేది నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో రాజీనామాలను ఉపసంహరించుకోవాలని అధిష్టానం నుండి తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులకు ఒత్తిళ్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్ ఆదివారం కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు కె కేశవరావుకు రెండుసార్లు ఫోన్ చేశారు. రాజీనామాలు ఉపసంహరించుకోవాలని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే అందుకు కెకె ససేమీరా అన్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు రాజీనామాలు ఉపసంహరించుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.

ప్రస్థుత పరిస్థితుల్లో రాజీనామాలు ఉపసంహరించుకోవడం కుదరదని తేల్చి చెప్పారు. తెలంగాణపై సానుకూల ప్రకటన చేస్తే రాజీనామాలపై ఆలోచిస్తామని చెప్పినట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై ప్రకటన చేయకుండా వెనక్కి వెళ్లం అని ఆజాద్‌తో తేల్చి చెప్పినట్లుగా సమాచారం. అయితే అధిష్టానంతో చర్చలకు రమ్మని ఆజాద్ పిలవడంతో అందుకు ఆయన సమ్మతించినట్లుగా తెలుస్తోంది. అధిష్టానంతో చర్చలకు వెళ్లేందుకు టి-కాంగ్రెసు ఎంపీలు మధుయాష్కీ ఇంట్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో వారు నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఈ భేటీలో స్పీకరు రాజీనామాలు తిరస్కరిస్తే పార్లమెంటులో పోరాటం చేయాలని ఎంపీలు నిర్ణయించుకునే అవకాశం ఉంది.

English summary
It seems, High Command putting pressure on Telangana Congress leaders to withdraw their resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X