లొంగిపోయిన పరిటాల ముఖ్య అనుచరుడు

2005లో పరిటాల రవి హత్య తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. ఏడేళ్లుగా అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఇటీవలే హత్యకు గురైన మద్దెలచెర్వు సూరి ఇంట్లో టివి బాంబు కేసులో ప్రధాన నిందితుడు. ఆర్వోసీ ముఖ్యనేతగా పని చేశాడు. లొంగిపోయిన అనంతరం చమన్ మాట్లాడారు. ప్రశాంతంగా బ్రతకాలనే తాను లొంగిపోయినట్లు చెప్పారు. తనకు ఫ్యాక్షన్ రాజకీయాలతో సంబంధం లేదని, ఎప్పుడూ దానికి దూరంగానే ఉన్నానని చెప్పాడు. చమన్ సొంత గ్రామం అనంతపురం జిల్లాలోని రామగిరి మండలం కొత్తపల్లి గ్రామం. కాగా పరిటాల రవి మరో అనుచరుడు పోతుల సురేష్ గతంలో లొంగిపోయారు. లొంగుబాటు అనంతరం చమన్ను పంజాగుట్ట పోలీసు స్టేషన్కు తరలించారు.
చమన్ లొంగుబాటు సమయంలో డిజిపి దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఫ్యాక్షం రాజకీయాన్ని రూపుమాపాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇప్పటికే ఫ్యాక్షన్ నేరాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ఫ్యాక్షన్ రాజకీయాలలో మగ్గుతున్న వారు రాష్ట్రంలోని ఏ పోలీసు స్టేషన్లోనైనా లొంగి పోవచ్చునని సూచించారు. లొంగుబాటు అేది చట్టపరమైన ప్రక్రియ అని చెప్పారు.












Click it and Unblock the Notifications