విభజన తేనెతుట్టెను కదిలించిన జైపాల్ రెడ్డి

తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయడంతో ప్రజలు సంతృప్తి చెందడం లేదని, రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని పట్టుపడుతున్నారని ఆయన అన్నారు. హైదరాబాదు వెళ్లాలంటే తాను ఆలోచించాల్సి వస్తోందని ఆయన అన్నారు. రాజీనామా చేయాలని తనపై తీవ్రమైన ఒత్తిడి ఉందని, రాజీనామా చేయనందుకు తనను స్వార్థపరుడిగా చిత్రీకరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇంత దాకా రావడానికి అధిష్టానమే కారణమని, అధిష్టానం సమస్య పరిష్కారానికి ఏం చేస్తోందో కేబినెట్ మంత్రినైన తనకు కూడా తెలియడం లేదని, గతంలో ఓ స్పష్టత ఉండేదని, ఇప్పుడు ఆ స్పష్టత లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications